24-09-2025 12:20:03 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 23, (విజయ క్రాంతి): ప్రభుత్వం నూతనంగా మహబూబా బాద్ జిల్లాలో నియమించిన గ్రామ పాలన అధికారులు (జిపిఓ) భాద్యతలు చేపట్టిన సందర్బంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను తన చాంబర్ లో కలిసి పూల మొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపాలన పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.