24-09-2025 01:34:27 PM
మెంధర్/పూంచ్: జమ్మూ కాశ్మీర్ సరిహద్దు(Jammu and Kashmir border) జిల్లా పూంచ్లో బుధవారం వాహనం బోల్తా పడి ఐదుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ సమీపంలోని బాల్నోయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు క్యాబ్లో సెలవుపై ఇంటికి వెళుతుండగా ఉదయం 7.15 గంటల ప్రాంతంలో మంకోక్ సెక్టార్లోని ఘని గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్మీ సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయని, వారిని మెంధార్ సబ్-జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.