2 July, 2026 | 12:33 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ముంబైలో అగ్నిప్రమాదం

24-09-2025 01:47 PM

ముంబై: ముంబైలోని కుర్లా ప్రాంతంలోని ఒక మురికివాడలోని కొన్ని గుడిసెలలో బుధవారం మధ్యాహ్నం మంటలు( Fire Accident ) చెలరేగాయని అధికారులు తెలిపారు. కుర్లా వెస్ట్‌లోని జారిమారి రోడ్డులో ఉన్న సేవక్ నగర్‌లోని గుడిసెలలో మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేస్తున్నారని పౌర అధికారి తెలిపారు. మంటలు ఐదు నుండి ఏడు గుడిసెలకే పరిమితమయ్యాయని, అగ్నిమాపక చర్య కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.