calender_icon.png 6 September, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తమూలుగ మార్పిడితో కొత్త జీవితం

06-09-2025 01:10:10 AM

  1. కిమ్స్ ఆస్పత్రిలో పదేళ్లుగా అందుతున్న సేవలు

విదేశీ రోగులకూ విజయవంతంగా చికిత్సలు

50 శాతం మ్యా ఉన్నా సత్ఫలితాలు

విజయోత్సవాల్లో వివరించిన డాక్టర్ నరేంద్రకుమార్ తోట

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రక్తానికి సంబంధించి అనేక సమస్యలుంటాయి. రక్తక్యాన్సర్‌తో పాటు సికిల్ సెల్ డిసీజ్, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా.. ఇలాంటి అనేక సమస్యలకు రక్తమూలుగను (బోన్ మ్యారో) మార్చడం ఒక్కటే పరిష్కారం. అయితే అందులో చాలా సమస్యలుంటాయి. ఒకప్పుడు ఉమ్మడి కు టుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండటంతో ఎక్కువమంది పిల్లలు ఉండేవారు.

అందువల్ల రక్తమూలుగ దాతల విషయంలో ఇబ్బంది అయ్యేది కాదు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరికైనా అవసరమైతే అదే కుటుంబానికి చెందిన దాతలు దొరకడం కష్టమవుతోంది. అలాంటప్పుడు 50 శాతం మ్యా ఉన్నా వైద్యరంగంలో వచ్చి న సరికొత్త పరిజ్ఞానంతో మూలుగ మార్పిడి విజయవంతంగా చేయొచ్చు. అలాంటి పరిజ్ఞాన్నాన్ని కిమ్స్ ఆస్పత్రి సమకూర్చుకుంది.

ఈ విషయాలను ఆస్పత్రికి చెందిన హెమ టో అంకాలజీ, స్టెమ్ సెల్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతి డాక్టర్ నరేందర్ కుమార్ తోట ఆస్పత్రిలో జరిగిన శుక్రవారం జరిగిన పదేండ్ల విజయోత్సవ కార్యక్రమంలో వివరించారు. కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఫిలాన్తరో పిస్ట్‌లు సుధారెడ్డి, పింకీ రెడ్డి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్ రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ అభినయ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేంద్రకుమార్ తోట మాట్లాడుతూ ‘రక్తమూలుగ మార్పిడి విషయంలో కిమ్స్ ఆస్పత్రి గణనీయమైన విజయాలు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఈ తరహా చికిత్సలు మొదలుపెట్టిన మొట్టమొదటి ఆస్పత్రి ఇదే కావడం మా అందరికీ గర్వకారణం. రక్తమూలుగను మార్చడమే కాకుండా, ఆ తర్వాత కూడా రోగిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ చికిత్స విజయవంతమయ్యేలా చూడడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి.

వాటన్నిం టినీ అధిగమిస్తూ పదేళ్లుగా అత్యంత ఎక్కువ విజయాల శాతంతో ముందడుగు వేస్తు న్నాం. ఈ విషయంలో జాతీయ సగటు కం టే కూడా కిమ్స్ ఆస్పత్రిలో విజయాల రేటు ఎక్కువ ఉండడం మాకు గర్వకారణం. ఇక్కడ ఉన్న నిపుణులు, ఉన్న అత్యాధునిక సదుపాయాలే అందుకు కారణం’ అని తెలిపారు. ఒకప్పుడు రక్తక్యాన్సర్ వచ్చినా, మరే సమస్య వచ్చినా రక్తమూలుగ మార్పించుకోవాలం టే రాయవెల్లూరులోని సీఎంసీకి, ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లా ల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

హైదరాబాద్‌లోనే అందుబాటులో అన్నిరకాల ఆధునిక చికిత్సలు వచ్చాయి. గడిచిన పదేళ్లలో 150 మందికి పైగా రోగులకు రక్తమూలుగ మార్పిడి చేసి, వారికి సత్ఫలితాలు అందించాం. ‘క్యాన్సర్ కేసుల్లో రక్తమూలుగ మార్పిడి 50 శాతం మ్యా అయినా చేయడం చాలా సులభమే. కానీ, సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా లాంటి కేసుల్లో అది చాలా కష్టం. మంచిఫలితాలు ఒక పట్టాన రావు.

అయినా కూడా అలాంటి కేసులకు సైతం ఈ ఆస్పత్రిలో విజయవంతంగా రక్తమూలుగను మార్పిడి చేశాం. పెద్దలు, పిల్లలకూ ఇలాంటివి చేసి, మంచి ఫలితాలు సాధించాం. పలు ఆఫ్రికన్ దేశాలు, గల్ఫ్ దేశాల రోగులకు కూడా ఇలాంటి 50% మ్యా ఉన్నప్పుడూ మార్పిడి చేశాం’ అని వివరించారు.