12-06-2025 02:34:55 PM
మేఘాలయ: హనీమూన్ హత్య కేసు(Meghalaya Murder) విచారణ మరో మలుపు తిరిగింది. హనీమూన్ లో భర్తను చంపించిన కేసులో తెరపైకి మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ(Sonam Raghuvanshi) తన బంధువు జితేంద్ర రఘువంశీ బ్యాంకు ఖాతాను ఉపయోగించి తన భర్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi case) హత్యకు నిధులు సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విచారణలో జితేంద్ర పేరు బయటపడింది. ఇది నేరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను వెలుగులోకి తెచ్చింది. ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది.
జితేంద్ర యూపీఐ ఖాతాను సోనమ్ వాడినట్లు నిర్ధారణ అయింది. జితేంద్ర(Jitendra Raghuvansh) ఖాతా నుంచే సుపారీ సొమ్ము చెల్లించినట్లు గుర్తించారు. మే 23న జితేంద్ర రఘువంశీ బ్యాంకు ఖాతా నుంచి సోనమ్ చెల్లింపులు చేసింది. హవాలా మార్గంలో సోనమ్ చెల్లింపు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జితేంద్ర రఘువంశీ తమకు బంధువేనని, జితేంద్ర తమ వద్ద ఉద్యోగిగా ఉన్నట్లు సోనమ్ సోదరుడు తెలిపారు. రోజువారీ ఖర్చుల కోసం జితేంద్ర ఖాతా వాడుతున్నట్లు సోదరుడు వెల్లడించారు. సోనమ్ యూపీఐ ఖాతా కూడా జితేంద్ర పేరిటే తెరిచామని ఆయన పేర్కొన్నాడు.
మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లకు(Contract killer) చెల్లింపు చేయడానికి సోనమ్(Sonam) తన బంధువు జితేంద్ర రఘువంశీ పేరు మీద రిజిస్టర్ చేయబడిన ఐపీఐ ఖాతాను ఉపయోగించారని అధికారులు వెల్లడించారు. రిపబ్లిక్ నివేదిక ప్రకారం, కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జితేంద్ర, లావాదేవీని సులభతరం చేయడంలో అతని పాత్రపై ఇప్పుడు పరిశీలనలో ఉన్నారు. సోనమ్ (25), రాజా (29) మే 11న ఇండోర్లో వివాహం చేసుకుని, మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు హనీమూన్ కోసం చేరుకున్నారు.
మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని(East Khasi Hills District) సోహ్రాలో, నోంగ్రియాట్ గ్రామంలోని హోమ్స్టే నుండి బయటకు వచ్చిన కొన్ని గంటల తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారు. మేఘాలయలోని చిరపుంజీకి దగ్గరగా ఉన్న సోహ్రా సమీపంలోని లోతైన లోయలో జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అతని భార్య సోనమ్ రఘువంశీ వారణాసి-ఘాజీపూర్ హైవేలో(Varanasi-Ghazipur Highway) రోడ్డు పక్కన ఉన్న దాబా దగ్గర ఆచూకీ లభించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ జంట మేఘాలయలో హనీమూన్లో ఉండగా అదృశ్యమయ్యారు. రాజా మృతదేహం చివరికి ఈశాన్య రాష్ట్రంలో లభ్యమైంది. ఇది ఉన్నత స్థాయి హత్య దర్యాప్తుకు దారితీసింది. శనివారం, నోంగ్రియాట్ నుండి సోహ్రాకు తిరిగి వెళ్తుండగా, ఒక టూర్ గైడ్ ముగ్గురు హిందీ మాట్లాడే పురుషులతో కలిసి ఆ జంటను చూసినట్లు సమాచారం