calender_icon.png 21 September, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌నగర్–సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ రహదారి మరమ్మత్తు

21-09-2025 02:09:29 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్ ఎంఐజి నుండి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వరకు ఎన్నో ఏళ్లుగా గుంతలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన రహదారి నేడు మరమ్మత్తు చేయబడింది. సొంత నిధులతో మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు లచ్చిరాం, బాబ్జి ముందడుగు వేసి పనులు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బిహెచ్ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. గర్భిణులు, వృద్ధులు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ మహిళలు ప్రత్యేకంగా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

మాజీ సర్పంచ్ సోమిరెడ్డి మాట్లాడుతూ... "ఎన్నో ఏళ్లుగా బిహెచ్ఎల్ యాజమాన్యాన్ని కోరినా ఫలితం లేకపోయింది. చివరకు ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్డు పనులకు అంగీకారం తెచ్చి పనులు చేయించాం" అన్నారు.

మాజీ కౌన్సిలర్ లచ్చిరాం మాట్లాడుతూ... "ఈ పనికి ఎంఐజి కాలనీవాసులు, బిహెచ్ఎల్ యాజమాన్యం, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు. విమర్శలు వచ్చినా పార్టీలకతీతంగా మేము ముందడుగు వేశాం" అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, బిహెచ్ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.