17 March, 2026 | 4:45 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

మీ మనవళ్లకూ సాధ్యం కాదు

10-11-2024 02:07 AM

370 పునరుద్ధరణ ప్పటికీ జరగదు

జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రాంచీ, నవంబర్ 9: జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం పాలము ప్రచార ర్యాలీలో పాల్గొని కశ్మీర్ ఇండియాలో భాగమని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం మీ నాలుగో తరానికి కూడా సాధ్యం కాదని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. 

ఓబీసీ కోటాకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మహారాష్ట్రలో మైనార్టీ నాయకులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని విమర్శించారు. ఓబీజీ, గిరిజన, దళితుల రిజర్వేషన్లను తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రధాని మోదీ, బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు.