22-05-2025 12:00:49 AM
తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్, విజయక్రాంతి: మే21:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు జారీ చేయడాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. ప్రజల గుండెల్లో ఉన్న నాయకులను వేధించడం అన్యాయం అని అన్నారు.
కాళేశ్వరం, రై తు బంధు, మిషన్ భగీరథ, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, పింఛన్ పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై అసూయతోనే కాంగ్రెస్ ఇలా కక్ష తీర్చుకుంటోందన్నారు.విచారణల పేరిట వేధిస్తే ప్రజలు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదఅని హెచ్చరించారు.హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు కెసిఆర్కు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.