బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు
బోథ్, జూన్ 13(విజయక్రాంతి): పార్టీ తనపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నియమించడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని నూతనంగా ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా నియామకం అయిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మాజీ సభ్యులు జివి రమణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విజయ క్రాంతి తో మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తుందన్నారు. గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలాంటి కార్యకర్తలు ఉన్నారని వారి సహకారంతో జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎంపీటీసీ జెడ్పిటిసి లలో ఎగురవేస్తామన్నారు. బోత్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందన్నారు అదిలాబాద్ జిల్లాలో బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తామన్నారు.






