calender_icon.png 20 June, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షాన నిలబడుతున్న నేత రాహుల్‌గాంధీ

20-06-2025 12:35:18 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్19:  దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ,ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు అన్నారు.రాహుల్ గాంధీ 55వ జన్మదినం సందర్భంగా గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి,పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ జోడోయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువై,వారి సమస్యలు తెలుసుకుని తెలంగాణ రాష్ట్రంలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని అన్నారు.త్యాగాల కుటుంబం నుండి వచ్చి ప్రజల కష్టాలను తీర్చగలిగే ఒకేఒక్క నాయకుడు యువనేత రాహుల్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు మోరపాక సత్యం,పెసర సతీష్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొమ్ము జోహార్,ఎలిమినేటి అభినవ్,నరేష్,భాషపోలు శ్రీనివాస్,మహేష్,కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శాలిగౌరారం మండల కేంద్రంలో...

శాలిగౌరారం, జూన్ 19 : శాలిగౌరారం మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి  ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకు అందరం కష్టపడి పని చేయాలని, రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సామాన్య గొంతు కాపాడాలని జై భీమ్ జై సంవిధాన్ జై బాపు అనే నినాదంతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి కార్మికుల కర్షకుల విద్యార్థుల కష్టాలను రాహుల్ గాంధీ తెలుసుకొని నిరంతరం పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరిగే నరసింహ, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండపల్లి  కొమురయ్య , మార్కెట్ డైరెక్టర్ జోజి రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూక కిరణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్, కాంగ్రెస్ నాయకులు కట్టంగూరి సురేందర్ రెడ్డి, వడ్లకొండ పరమేష్, ననుబోతు అంజయ్య మాధగోని  అంజయ్య, రవీందర్ రెడ్డి, కొక సాయి, తోటకూరి పరుశరాములు,గుండ్లపల్లి సైదులు , వలిశెట్టి సైదులు,జమ్మూ అశోక్ కర్నాటి కృష్ణ ,నూక కిషోర్ ,లొడంగి మహేష్, బండమీది రమేష్, రామచంద్రయ్య, నాగరాజు, ఎర్ర సుధాకర్,అన్నెబొయిన అనిల్,వడ్లకొండ  సైదులు,సింగరి శ్రీనువాస్,  బందెలా ఉదయ్, ముత్తయ్య ,సుల్తాన్ వెంకన్న వేముల పవన్ తదితరులు పాల్గొన్నారు.