14 April, 2026 | 10:13 PM

అంబేద్కర్ భవన్లో అధికారిక వేడుకలు

14-04-2026 06:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలను నిర్మల్ డిఆర్ఓ రత్న కళ్యాణి జ్యోతి వెలిగించి ప్రారంభించారు పంచరంగుల జెండా ఎగురవేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ జయంతి వేడుకల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎస్సీ, బిసి  సంక్షేమ అధికారులు దయానంద్, శ్రీనివాస్, సిపిఓ జీవరత్నం, తహసిల్దార్ లు రాజు, ప్రభాకర్, ఇతర అధికారులు, పలువురు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.