23 March, 2026 | 2:57 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

అయ్యో పాపం.. పసిపాప

28-08-2024 12:27 AM

చెత్తకుప్పలో మృత శిశువు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఆ బిడ్డకు పుట్టగానే నూరేళ్లు నిండిపోయాయి. భువిపైకి వచ్చిన గంటల వ్యవధిలోనే చెత్తకుప్పలో ఆ పసిపాప మృతదేహాన్ని చూసిన బాటసారులు, స్థానికులు కంటతడి పెట్టారు. మంగళవారం నగరం నడిబొడ్డున ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎవరో అప్పుడే పుట్టిన పసికందును ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి సైఫాబాద్ పీఎస్ పరిధిలోని లక్డీకాపూల్ బ్రిడ్జిపై నుంచి విసిరేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు ఎవరు? ఎలా మృతి చెందింది. ఎవరు తెచ్చి పడేశారు అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.