17 April, 2026 | 8:44 AM

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

24-05-2025 12:00 AM

మేడ్చల్, మే 23(విజయ క్రాంతి): మేడ్చ ల్ పట్టణ పరిధిలోని అత్వెల్లిలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెంకటేశ్వ రస్వామి ఆలయం సమీపంలో చెరువు పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా షాక్  తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.  బోర్ పాడవడంతో మరమ్మతు చేయాలని ఫోన్ రావడంతో చేయడానికి వచ్చాడు. ఈ సమయంలో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.