ఏసీ బస్సుల్లో 10 శాతం సబ్సిడీ
08-12-2024 02:59 AM
* ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సరిరామ్
ఖమ్మం, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ బస్ డిపోల పరిధి నుంచి హైదరాబాద్ వెళ్లే ఏసీ బస్సుల్లో చార్జీలపై 10 శాతం సబ్సిడీని ప్రకటిం చినట్లు ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ సరిరామ్ శనివారం తెలిపారు. ఈ సబ్సిడీ ఏసీ స్లీపర్, రాజధాని బస్సుల్లో ఈ నెల 31వరకు అమలు లో ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.




