28-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): 9 బ్యాంక్ యూనియన్ల సమాఖ్య అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) మంగళవారం అఖిల భారత బ్యాంక్ సమ్మెకు పిలు పునిచ్చింది. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాం కులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు చెందిన సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. బ్యాంకింగ్ పరిశ్రమలో 5 రోజుల పని వారం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపాలని, ప్రస్తుతం సెలవులుగా ఉన్న 2వ, 4వ శనివారాలతో పాటు, మిగిలిన అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్ 2023, మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూఎఫ్బీయూ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం దీనిని వెంటనే అమలు చేయాలన్నారు.
2015 నాటి ఒప్పందం ప్రకారం నెలలో రెండు శనివారాలు సెలవులుగా ప్రకటించారు. ఆ సమయంలో మిగి లిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 2023లో జరిగిన చర్చల్లో, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పనివేళలను 40 నిమిషాలు పెంచడం ద్వారా అన్ని శనివారాలను సెలవులుగా మా ర్చడానికి అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదన గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది. మార్చి 2025లో చే యాల్సిన సమ్మెను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాయిదా వేసినప్పటికీ, ఇప్పటివర కు ఎటువంటి పురోగతి లేదు.
ఆర్బీఐ, ఎల్ఐసీ, జీఐసీ వంటి ఆర్థిక సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానం అమల్లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయి. డిజి టల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, శనివారాలు సెల వు ఇవ్వడం వల్ల కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగదు.
తమను మాత్రమే వివక్షకు గురి చేస్తున్నారనే అసంతృప్తితో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ విషయాలను గాలేటీ నాగేశ్వర్ (వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఏఐబీఓసీ, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఎఫ్బీఓఐఓఏ, జనరల్ సెక్రటరీ బీఓఐఓఏ ఏపీ, తెలంగాణ యూనిట్) వెల్లడించారు.