28-01-2026 12:00:00 AM
చిన్నంబావి, జనవరి 27: అర్హులైన వారందరూ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లద్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి,బీచుపల్లి యాదవ్, నరసింహ రెడ్డి, తేజరెడ్డి, నరేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, లద్దిదారులు తదితరులు పాల్గొన్నారు.