07-06-2025 12:00:00 AM
గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లితండ్రులను, దివ్యాంగ సోదరుల సంరక్షణ కోసం తీసుకు వచ్చిన మేయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007 ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ చట్టాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం కవాడిగూ డలో అడ్వకేట్ జేఏసీ కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టాల వల్లా సివిల్ కోర్టుల్లో పనిభారం తగ్గతుందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా వయోవృద్ధ తల్లిదండ్రులకు సత్వర న్యాయం 90 రోజుల్లో జరుగుతుందన్నారు. ఈ చట్టం గురించి బహుల ప్రచారం లేనం దున వయోవృ ద్ధులైన తల్లి దం డ్రులు తమ భావ లను భయటి ప్ర పంచానికి చెప్పు కోలేక తమ లో తాము క్రుంగి, మానసిక భాదలను అనుభవిస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వల్ల కొంత మందికి ఊరట కలుగుతున్నా ఎలాంటి పెనషన్ కు అర్హులుకాని, అగ్రవర్ణంలోని వృద్ధులు వారి బాధలు వర్ణనాతీతం అన్నారు. 2007 బృతి చట్టంలో ఉద్యోగం చేస్తున్న వారి గురించి లేదని అన్నారు. అది తల్లిదండ్రుల ఆస్తి అని అనుభవిస్తున్న వారు తల్లిదండ్రుల బాగోగులు చూడనట్లయితే వారు ఆర్.డీ.వో ద్వార న్యాయాన్ని పొందే వెలుగు బాటు ఉందన్నారు.