calender_icon.png 4 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోర్నకల్ లో ఆవిర్భావ వివాదం

02-06-2025 06:27:06 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు కయ్యానికి కాలు దువ్వడంతో ఇరువర్గాల మధ్య ఆవిర్భావ వివాదం చోటు చేసుకుంది. దీనితో ఇరువు వర్గాలను శాంతింప చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. డోర్నకల్ పట్టణంలో గాంధీ సెంటర్ వద్ద ఉన్న బీఆర్ఎస్ జెండా గద్దె సమీపంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుండి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించగా, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకున్నారు. దీనితో ఎవరికి వారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడడంతో సిఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తన అనుచరులతో రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన జండా గద్దే వద్ద పతాకావిష్కరణ చేశారు. 

వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే విజయం సాధించి, మంత్రిని కూడా కావడం తగ్గమని, అప్పుడు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని ప్రత్యర్థులను మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ హెచ్చరించారు.