08-05-2025 12:05:08 AM
-జహీరాబాద్, మెదక్ ఎంపీలు సురేష్ శెట్కర్, రఘునందన్ రావు
సంగారెడ్డి, మే 7(విజయక్రాంతి): జిల్లా ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందటమే తన లక్ష్యమని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు. బుధవారం ఎంపీ సురేష్ శెట్క ర్ అధ్యక్షతన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మంది రంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి సహ అధ్యక్షులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, టీజీఐఐసి చైర్మన్ నిర్మ లా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హాజరయ్యా రు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.
ముఖ్యంగా గ్రా మీణాభివృద్ధి, పేదల సంక్షేమం, విద్యా, ఆరోగ్య రంగాల్లో జ రుగుతున్న పనులపై చర్చ జరిగింది. అధికారులచే సమర్పించబడిన వివరాల ఆధారంగా, సమస్యాత్మక అంశాలు గుర్తించ బడి వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 165 నేషనల్ హైవే పనులు వెం టనే పూర్తి చేసేలా నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని, వచ్చే సమా వేశానికి నేషనల్ హైవే అధికారులు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని పటాన్చెరువు, జహీరాబాద్ నేషనల్ హైవేలో మల్కాపూర్ వద్ద, నాందేడ్ అకోలా రహదారిలో సుల్తాన్ పూర్ వద్ద అసంపూర్తిగా ఉన్న పనులు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వి ద్య, వైద్య, గృహ, ఆరోగ్య శాఖల అధికారులను జిల్లాలో జరుగుతున్న ఆయా శాఖల పనుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించడం కోసం ఉన్న భవనాన్ని కూల్చివేశారని, భవన నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు చెట్లకింద చదువుకోవాల్సిన పరిస్థి తి నెలకొంది అన్నారు. వెంటనే పాఠశాల భవనం నిర్మించేలా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నా రు.
జిల్లాలో చెరువులు, కుంటలలో మత్స్యశాఖ ద్వారా చేపల పెంపకానికి అవసరమైన చేప పిల్లల్ని జిల్లాలోని ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రోడ్లు భవనాల నిర్మాణంలో గల ఆలస్యానికి కారణాలు అడిగారు. టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రజలకు ఏ అవసరాలు ఉన్న ప్రభుత్వాలు తీరుస్తున్నట్లు ఆమె వివరించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే చేరాలని అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ నాయకులు అధికారుల సమన్వయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తక్షణం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ జ్యోతి, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.