17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తిరుమల హిల్స్ ప్రభుత్వ భూమిని రక్షించండి

08-05-2025 12:05 AM

మణికొండ, మే 7: తిరుమల హిల్స్ ప్రభుత్వ భూమిని రక్షించడానికి  హైడ్రా  కమిషనర్ జోక్యం చేసుకోవాలని ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు వంశీ, తిరుమల హిల్స్ అధ్యక్షుడు అవినా శ్‌లు కోరారు. బుధవారం తిరుమల హిల్స్ కార్యాలయం ఆవరణంలో వారు మాట్లాడుతూ.. 1994లో పంచాయతీకి తిరుమల కొండలోని సుమారు 6,000 చదరపు గజాల భూమిని గిఫ్ట్ డీడ్ ఇచ్చారన్నారు.

ఈ భూమిని కాపాడాలని ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ పరిధిలో ఉన్న అన్ని కాలనీలు, ఆర్డబ్ల్యూఏ సమాఖ్య ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సంప్రదించినట్లు తెలిపారు. ఎఫ్‌ఎసీఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు వంశీ, తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షుడు అవినాశ్, స్థానికులు భరత్, రంగనాథ్ చారి, శ్రీనివాస్ తదితరులు ఇచ్చిన ఫిర్యాదును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి, భూ రక్షణకు చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారి రాజశేఖర్ను ఆదేశించినట్లు తెలిపారు.

దీంతో రాజశేఖర్ తిరుమల హిల్స్ లోని స్థలాన్ని సందర్శించి, అనధికార నిర్మాణ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.