20-06-2025 12:26:32 AM
రాష్ట్ర గృహ నిర్మాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మోతే, జూన్ 19:- ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మోతె మండలంలోని విభళపురం గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. కోదాడ శాసనసభ సభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి ప్రభుత్వం నిరుపేదలకు కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సభను ఏర్పాటు చేశారు.
ఈ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ల పేరుతో ఏ ఒక్క నిరుపేదలకు డబల్ బెడ్ రూములు అందకుండా చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తామని గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామని తెలిపా రు. గత ప్రభుత్వం ధరణి పేరుతో వేలకోట్ల భూములు బడా భూస్వాములకు పెట్టుబడిదారులకు ధారా దత్తం చేసిందని వాటిని అరికట్టేందుకే భూభారతి ని తీసుకొచ్చామని రైతులందరినీ ఆదుకుంటామని ఈ రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, తహసీల్దార్ ఎం. వెంకన్న, ఎంపీడీవో ఆంజనేయులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు పందిళ్ళపల్లి పుల్లారావు, బానోతు మాతృ నాయక్, మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య, సీనియర్ నాయకులు మైనంపాటి గురువారెడ్డి, సామ చిన్న వెంకటరెడ్డి, ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.