14-05-2025 01:31:32 AM
కరీంనగర్, మే13 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డు సి.బి.ఎస్.సి. విడుదల చేసిన పదవ తరగతి సిబిఎస్సి వార్షిక ఫలితాల్లో స్థానిక నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల మరియు పారమిత వరల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు . ఇట్టి ఫలితాలలో 500 మార్కులకు 488 మార్కులతో ఆకుల శ్రీరామ చంద్ర ,487 మార్కులతో రూపనిగమ మరియు మనోజ్ఞ ,481 మార్కులతో స్ఫూర్తి, 480 మార్కులతో బి.వర్షిణి అత్యధిక మార్కులు సాధిoచారు.
ఈ ఫలితాల్లో 62 మంది విద్యార్థులు 90 శాతం పైన మార్కులు సాధించగా 80 నుండి 100 శాతం సాధించిన విద్యార్థులు 160 మంది . 100% ఉత్తీర్ణతో పారమిత విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిoచారని ప్రత్యేకించి గణిత మరియు సామాన్య శాస్త్రతో కలిపి అత్యథిక విద్యార్థులు అత్యుత్తమ శాతాలలో ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు.
పారమిత విద్యాసంస్థలలో నైపుణ్యాలకు పెద్దపీట వేసి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ పద్దతిలో ఎక్కడా కూడా అధిక మార్కులు సాధించడానికి విద్యార్థులను బట్టి విధానానికి ప్రోత్సహించడం జరగదు. అత్యధిక విద్యార్థులు అత్యుత్తమ శాతాలతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా॥ ఇ. ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన,అనుకర్ రావు, రశ్మిత, రాకేష్, ప్రాచీ, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్, టి.ఎస్వి. రమణ, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు ఎం .శ్రీకర్, గోపికృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు. పాఠశాలకు ఉత్తమ సహకారాన్నందిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.