calender_icon.png 22 July, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయమీర్ పెళ్లి కబురు

22-07-2025 12:00:00 AM

కోయ భాషలో పెళ్లి పత్రిక  ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో

భద్రాచలం, జులై 21, (విజయ క్రాంతి): కోయ భాషలో పెళ్లి పత్రిక వచ్చేసింది. ఇప్ప టి వరకు తెలుగులో శుభలేఖలు వేసుకున్న ఆదివాసీలు ఇక తమ వాడుక భాష అక్షర రూపం దాల్చడంతో నూతన సరళికి శ్రీకా రం చుట్టారు. ఆదివాసీ వాడుక భాషను లిపి రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన భ ద్రాచలం ఐ.టి.డి.ఎసఫలీకృత మైందని చె ప్పొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

పాల్వంచ గ్రామానికి చెంది న కన్న రాజు అనే ఆదివాసి యువకుడికి భ ద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూనే ల క్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహం ముహూ ర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివా హ వేడుక సంబంధించి కళ్యాణ ఆహ్వాన ప త్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ కళ్యాణ ఆహ్వాన పత్రిక చూడము చ్చటగా ఉంది. పందీర్ ముహూర్తం, పెళ్లి మూర్తం, మా సొంత నార్, కబూర్, కరంగానూర్ ఇయాల్ అంటూ...

కోయ భాషలో శు భ ఘడియలు, వేదిక, విందు, ఆహ్వానించువారు ఈ పదాలను పొందుపరిచి భళా..ఆదివాసీ శుభ కళ్యాణ పత్రిక అనేలా రూపొం దించారు. కళ్యాణ పత్రిక పై భాగాన భద్రాచ లం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఐఏఎస్ ప్రేరణతో ’కోయ భాషలో పెళ్లి శుభలేఖ అంటూ ముద్రించి పి.ఓ పై తమ అభిమానా న్ని చాటుకున్నారు. సోమవారం ఈ ఆహ్వాన పత్రికను భద్రాచలం ఐటీడీఏ పీవో ఛాంబర్ లో పిఓ రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు.

కోయ భాష దినోత్సవం రో జునే కోయ భా షలో ఉన్న ఈ ఆహ్వాన పెళ్లి పత్రికను ఆవిష్కరించడం గమనార్హం.  ఈ సందర్భంగా ఐటీడీఏ పీ వో రాహుల్ మాట్లాడుతూ... కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడ టం ఆనందకరంగా ఉందన్నారు. గిరిజనుల మాతృభాషలో లిపి అం దుబాటులోకి రావ డం అభినందనీయమన్నారు. ఇందుకోసం భద్రాచలం ఐటిడిఏ ఎంతగానో చర్యలు తీసుకుందన్నారు.

అంతరించిపోతున్న ఆదివాసి గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అం దించే ప్రయత్నంలో భాగంగానే భద్రాచలం లో ట్రైబల్ మ్యూజి యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీల సంస్కృతిపై ప్ర త్యేక అధ్యయనం చేసి ఆదివాసి తెగల ఇలవేల్పుల చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నే టితరం గిరిజన బాలబాలికలకు, యువతి యువకులకు వారి భాష పై మక్కువ కలిగేలా ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న స్వాతం త్ర దినోత్సవ వేడుక,

గణతంత్ర దినోత్సవంవెబ్ వేడుక, తెలంగాణ ఆవిర్భావ దినోత్స వాల సందర్భంగా అందించే ఆహ్వాన పత్రిక లు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశం సా పత్రాలు కోయ భాషలోనే ముద్రించి పంపిణీ చేయడం జరిగిందని పిఓ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, గిరిజన మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.