30-10-2025 06:27:00 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామం మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ కుమార్ గురువారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక అవసరాలపై ఆత్మీయంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, గెలుపు సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో అజయ్ గౌడ్ వెంట పలువురు ఉన్నారు.