calender_icon.png 30 December, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర

30-12-2025 01:00:24 AM

మునుగోడు,డిసెంబర్ 29 (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ జనవరి 9న నల్లగొండ పట్టణంలోని రామగిరి దేవాలయం నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు మంత్రి పదవి వస్తే జిల్లాలోని నిరుపేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

కావున జిల్లాలోని ననుమూలల నుండి అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.ప్రజల మనోభిలాషను దేవునికి విన్నవిస్తూ, ప్రజాసంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి  ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా, ముఖ్యంగా పేద ప్రజల విద్యా, ఆరోగ్య అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ  బద్దెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.