27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలెం సర్పంచ్

27-01-2026 12:32 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి):సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పాలెం గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణను మంగళవారం మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్,  గ్రామ పెద్దలు, ఆత్మీయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రామకృష్ణకు ఈ పదవి మరింత బాధ్యతను పెంచుతుందని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రామకృష్ణకు అభినందనలు తెలిపారు.