10 April, 2026 | 1:50 AM

ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శాశ్వత తొలగింపు

10-04-2026 12:08 AM

అలంపూర్ ఏప్రిల్ 9:అయిజ మండలం ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన బోయ రంగన్న గత నెల 13న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడితో బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి పట్టుబడ్డారు.

పంచాయతీ కార్యదర్శి రంగన్న పై నేరారోపణ రుజువు కావడంతో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని అధికార యంత్రాంగం నిబద్ధతతో, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై, అవినీతికి పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.