calender_icon.png 26 November, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవభారత నిర్మాణానికి పటేల్ కృషి

26-11-2025 12:04:34 AM

  1. యూనిటీ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం, నవంబర్ 25 (విజయ క్రాంతి): నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు పయనించాలని  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జ యంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియం ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఖమ్మం సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికు పూలమాలవేసి నివాళులర్పించి, ఐక్యత పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యులైన వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మా ట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వా తంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు.

భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు.  ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. భా రతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రతి పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని, దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిచే ఐక్యత(ఆత్మ నిర్భర్భారత్) ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా మేరా యువభారత్ ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల గారు మాట్లాడుతూ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ 2025 అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించబడే ఒక కార్యక్రమం అని అన్నారు. ఈ మార్చ్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని జరుపుకుంటూ దేశ ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  పూర్వ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, డి.వై.స్.ఓ తుంబూరు సునీల్ రెడ్డి గారు, జిల్లా ఎన్.ఎస్.ఎస్ కన్వీనర్ డా. నార్సింగి శ్రీనివాసరావు , ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కె.రజని, ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఏ సి ఎం ఓ పి ఎం అర్ సి ఎల్.రాములు, హెచ్ డబ్ల్యు ఓలు నరసింహులు బాలాజీ, మేరా యువభారత్ ఖమ్మం జిల్లా ఎకౌంట్స్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ కమరతపు భాను చందర్, కన్వీనర్ నాయుడు రాఘవరావు సుమారు 600 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.