27-10-2025 12:22:39 AM
టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్
పటాన్ చెరు, అక్టోబర్ 26 :కండర క్షిణిత వ్యాధి బాధితుల సంఘం 18వ వార్షికోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇందిరమ్మ కాలనీలోని రామాలయం ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 23 మంది కండర క్షిణిత వ్యాధి బాధితులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హిమబిందు, రాంరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శిరీష, జగదేవి, మణికుమార్, సుధీర్, కొత్తపల్లి నరసింహులు, నవీన్ లు కలిసి 23 మంది కండర క్షిణత వ్యాధి బాధితులకు ఒక్కొక్కరికి రేండు వేల రూపాయల విలువచేసే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కండర క్షిణత వ్యాధి బాధితులకు తమ వంతు సహాయంగా ప్రతి సంవత్సరం సరుకులు అందించడం తమకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. కండర క్షిణత వ్యాధి గ్రస్తులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రోత్సాహం మరువలేనిది..: రవికుమార్
తనకున్న అంగవైకల్యాన్ని ఆయుధంగా మార్చుకొని గత 18 సంవత్సరాల క్రితం ఒంటరిగా ప్రారంభమైన తన ప్రయాణంలో నేడు ఎందరో భాగస్వామ్యమై తన ప్రయాణంలో తోడుగా ఉన్నారని తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్, టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ తెలిపారు.
కండర క్షిణత వ్యాధిగ్రస్తులకు ప్రతి సంవత్సరం నిత్యావసర సరుకులు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఇస్నాపూర్ సభ్యులు, పి ఆర్ టి యు రాష్ట్ర మహిళా నాయకురాలు వాకిటి శ్రీదేవి, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటేష్, కృష్ణ, దివ్యాంగుల నాయకులు కంచిగారి మహేష్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.