15-05-2025 12:16:32 AM
సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం: దర్శకుడు రాజ్
‘మల్లేశం’, ‘8పీఎం మెట్రో’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ రాచకొండ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా మే 16న రిలీజ్ కానున్న సందర్భంగా దర్శకుడు రాజ్ ఆర్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
నేను ఇప్పుడు ‘23’ లాంటి కథతోనే రావడమనేది కోఇన్సిడెంట్. ప్లాన్ చేసుకున్నది కాదు. ‘8 పీఎం మెట్రో’ తర్వాత బ్రేక్ తీసుకుందామని అనుకున్నా. ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ను కలిసినప్పుడు ఆయన చిలకలూరిపేట ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆ సంఘటన గురించి నాకు తెలుసు. అప్పుడు నాకు 19 ఏళ్లు. అయితే ఆ సంఘటన ఆ ఘటన గురించి ఇప్పుడు విన్న తర్వాత అందులో చాలా కథలు కనిపించాయి.
అయితే చేసిన తప్పును అప్పుడు సమర్ధించడం లేదు.. సినిమాలో కూడా సమర్ధించలేదు. కానీ అది సినిమా ఫార్మెట్కి పనికొచ్చే కథ కాదనిపించింది. అదే రాత్రి ఫ్రెండ్ కాల్ చేసి చుండూరు ఘటన గురించి చెప్పాడు. ఆ ఇన్సిడెంట్లో కూడా సినిమాకు పనికొచ్చే కథ లేదు. అయితే ఈ రెండు కథలను కాంట్రాస్ట్ చేసి చూస్తే సినిమాకు పనికొచ్చే కథ కనిపించింది.
ఈ రెండు కథలతోపాటు జూబ్లీహిల్స్ స్టోరీ కూడా ఉంటుంది. అలాగే అమ్మాయి, అబ్బాయి ప్రేమకథ చాలా కీలకం. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఆ ఘటనల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయే. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇందులో రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో ఉన్న వ్యక్తి నటించాడు కదా.. ఆయనలో ఎలాంటి మార్పు గమనించారా? అని అడిగితే నేను చెప్పేదేంటంటే.. 19 ఏళ్ల వ్యకికి ఉన్న ఆలోచనలు 35 ఏళ్లప్పుడు ఉండవు. మనిషి ఆలోచనలు అతను తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా వయసుకు తగ్గట్టు మారుతూ ఉంటాయి. దీనివెనుక న్యూరో సైన్స్ ఉంటుంది. ఒకప్పుడు కరెక్ట్ అనుకున్న వ్యక్తి ఒక 20 ఏళ్ల తర్వాత రాంగ్ అని అనిపించొచ్చు. చేసిన తప్పులపై పశ్చాత్తాపం ఉంటుంది.
నేను ప్రతి కథను ఏదో ఐడెంటిఫై చేసుకుని చేసిందే. మల్లేశం కథ కూడా నేను అలా ఐడెంటిఫై చేసుకునే తీశాను. అయితే ఆ సినిమాను అంతమంది ఆడియన్స్ చూస్తారని అనుకోలేదు. మనిషి ఫెయిల్ అయినా పరవాలేదని చెప్పేందుకు తీసిన సినిమా అది.
కోవిడ్ తర్వాత అందరం కూడా మెంటల్ హెల్త్కు గురయ్యాం. 8 పీఎం కథ అలా వచ్చినదే. 23 సినిమా తీయడానికి కారణం నేను ఓ ఏజ్లో కొన్ని తప్పులు చేశాను. ఇప్పటికీ కొన్ని గుచ్చుకుంటాయి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయితే హ్యాపీ.
నిజానికి ఇది చాలా టఫ్ సబ్జెక్టు. ప్రొడక్షన్ పరంగా రైటింగ్ పరంగా అన్నిటి పరంగా ఇది చాలా టఫ్. ఇలాంటి సబ్జెక్టు తీయ డం వెరీ చాలెంజింగ్. ఇ న్ని లొకేషన్స్ ఇన్ని టైమ్ ఫ్రేమ్స్లో రాయడం దాన్ని తీయడం దాన్ని అర్థం చేసేలా చూపించడం కూడా చాలా కష్టం. ఏకాగ్రతతో చూడాల్సిన సినిమా ఇది. ఆడియన్స్ కాస్త కాన్సెంట్రేట్ చేసి చూడాలి.
ఈ సినిమాకు ఎదుర్కొన్న సెన్సార్ పరంగా చాలా కష్టాలు వచ్చాయి. చాలామంది ఈ సమయానికి ఈ కథ రెలవెంట్ కాదు కదా అంటారు. ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ వస్తుంది. అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్లకు కూడా రాదు. ఈ సమస్య ఇప్పటికీ రెలెమెంట్గా ఉంటుంది కదా. -ఒక విషయాన్ని ఎంత సెన్సిటివ్గా చెప్పాలో ఒక ఫిలిం మేకర్గా నాకు క్లారిటీ ఉంటుంది.
ఈ సినిమా వైలెన్స్కి ఎగైనెస్ట్ చేసింది. సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొన్ని సినిమాల్లో స్వేచ్ఛగా వదిలేసిన సీన్స్, పదాల్ని ఇంకొక సినిమాలో సెన్సార్ చేయమని చెప్తారు. ఒక చట్టం ఒకలా ఉన్నప్పుడు అన్ని సినిమాలకూ ఒకలాగా వర్తించాలి. కానీ అలా జరగటం లేదు. దీన్ని ఎవరో ఒకరు ప్రశ్నించాలి. అలాంటి ఒక ప్రశ్నను రేకిత్తించే సినిమానే ఇది.