21 April, 2026 | 5:42 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించండి

27-03-2025 12:29 AM
  • పన్ను వడ్డీ పై 90% రాయితీ పొందండి

మున్సిపల్ కమిషనర్ తిరుపతి 

అందోల్, మార్చి 26 :ఆందోల్ - జోగిపేట మున్సిపల్ పురపాలక సంఘం లొ ఆస్తి పన్ను బకాయిలపై విధించబడిన వడ్డీలో 90% మాఫీ చేస్తూ, ఆస్తి పన్ను బకాయిదారులందరికీ వెసులుబాటు కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలలో ఈ అవకాశం వర్తించేలా ఓటిఎస్ స్కీం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులందరూ చెల్లించవలసి ఉన్న మొత్తం ఆస్తి పన్నులు వెంటనే చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.