18-06-2025 04:37:57 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల(Samsthan Narayanpur Mandal) కేంద్రంలో వానరాల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గుంపులు గుంపులుగా 30-40 వానరాలు ఒకేసారి ఇళ్లపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మహిళలను పిల్లలను బెదిరిస్తూ వారి చేతిలోని ఆహార పదార్థాలను లాగేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి వానరాల బాధ నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులను దాడి చేసి గాయపరుస్తాయేమోనన్న భయంతో తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.