18-06-2025 04:41:53 PM
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ..
మునగాల: మండల పరిధిలోని తాడ్వాయి, విజయరాఘ వపురం, కలకోవ, గ్రామాలలో బుధవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మండల ఇంచార్జ్ వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్సీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ... జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మునగాల మండలంలోని ప్రతి గ్రామంలో నిర్వహించాలని ప్రతి గ్రామంలో జెండా దిమ్మెలు నిర్మాణం చేయాలని తెలియజేశారు.
మాదిగల దైవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగ సమాజం కోసం అంకితం చేసాడని, ప్రతి సంక్షేమ పథకంలో మందకృష్ణ మాదిగ పోరాటం ఉందని తెలిపారు. మాదిగ జాతి కోసం పోరాడుతూనే సమాజంలో సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన వ్యక్తికి పద్మశ్రీ రావడం ఎంతో సంతోషాదయకమని, ఆ పద్మశ్రీ పేద వర్గాలకు వచ్చిందని, జాతి కోసం చేసిన పోరాటాన్ని గ్రామాలలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డకు ఉందని, దాంట్లో భాగంగా యల్ఇడి లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి జిల్లేపల్లి లింగరాజు, జల్లేపల్లి వెంకటేశ్వర్లు, కోటా ప్రవీణ్, భాస్కర్, శ్రీను, రాగిశెట్టి నరసయ్య,కోట రమేష్, కోట సైదబాబు, కోట దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.