17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బంద్‌కు ప్రజలు సహకరించాలి

16-10-2025 01:08 AM
  1. 130 కుల, 30 బీసీ, ఉద్యోగ సంఘాల మద్దతు

18న రాష్ట్ర బంద్‌తో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సెగ పుట్టిస్తాం 

17న బషీర్బాగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ

బీసీ కుల, ఉద్యోగ సంఘాల సమావేశంలో జేఏసీ చైర్మన్, ఎంపీ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల

ముషీరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ నెల 18న రా ష్ట్రంలో జరిగే బంద్‌లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్‌కు మద్దతుగా బుధవా రం హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో 130 బీసీ కుల, 30 బీసీ, ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిధు లుగా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెంచిన బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి అనేకమంది కుట్రలకు పాల్పడుతున్నారని, ఇందుకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ వ్యతి రేకులను ఎండగట్టి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల సాధన కోసం బంద్‌ను చేపడుతున్నట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా అన్ని కులాలకు రాజకీయ ప్రాతిథ్యం పెరుగుతుందని, అంతిమంగా రాజ్యాధికారంలో బీసీలకు జనాభా దామా షా ప్రకారం వాటా దక్కుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర బంద్‌కు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నదని, అన్ని కులాలు ఏకమై బంద్‌లో పాల్గొని బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు, విద్యాసం స్థలు, పె ట్రోల్ బంక్ యజమాన్యా లు, ఆర్టీసీ, రవా ణ వ్యవస్థ బంద్ రోజు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర బంద్ నిర్వ హించడం ద్వారా బీసీ డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించగలుగుతామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తామని వివరించారు.

పీ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ జేఏసీ కో చైర్మన్లు వీజీఆర్ నారగోని, దాసు సురేశ్, మీడియా కో-ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకల శ్యాం కుర్మా, ఏం చంద్రశేఖర్‌గౌడ్, శేఖర్ సగర, ధీటి మల్లయ్య, మహేశ్ యాదవ్, హౌలా చంద్రశేఖర్, జగన్నాథం, జ్ఞానేశ్వర్, గుజ్జ సత్యం, రామకోటి, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, వరికుప్పల మధు, వెంకటేశ్‌గౌడ్, పానుగంటి విజయ్, నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.