6 July, 2026 | 3:28 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 18 శాతం వృద్ధి

12-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 10 వరకూ దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.3 శాతం వృద్ధిచెంది రూ.11.25 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ళు రూ.5.98 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.4.94 లక్షల కోట్లు. సెక్యూరిటీల లావాదేవీ పన్నులు (ఎస్‌టీటీ) రూ.30,630 కోట్ల మేర వసూలయ్యాయి.

గిఫ్ట్ ట్యాక్స్‌తో సహా ఇతర పన్నులు రూ.2,150 కోట్లు వచ్చాయి. నిరుడు ఇదేకాలంలో రూ.9.51 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 10 వరకూ  స్థూల ప్రత్యక్ష పన్నులు వసూళ్లు 22.3 శాతం వృద్ధితో రూ.13.57 లక్షల కోట్లకు చేరగా, రూ.2.31 లక్షల కోట్ల రిఫండ్స్ జారీచేసింది. గత ఏడాదితో పోలిస్తే రిఫండ్స్ 46 శాతం పెరిగాయి.