18-06-2025 04:13:52 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలోని ముఖ్య కూడళ్లలో,కూరగాయల మార్కెట్ యార్డు వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏఈకి వినతి పత్రం అందజేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీధి దీపాల ఏర్పాటు చేయాలని గ్రామపంచాయితీ సెక్రటరీని సంప్రదించగా విద్యుత్ దీపాల వైర్లు లేవని చెప్పారని, ఏఈని కలిసి విద్యుత్ వైర్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశామని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు.