ఫోన్ ట్యాపింగ్ నిందితులను శిక్షించాలి
29-05-2024 01:02 AM
పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాం డ్ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేసిన ప్రజాప్రతినిధులను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరారు. మంగళవారం గాంధీభవన్లో ఆయ న మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. నిఘా, పోలీసు వ్యవస్థను గతప్రభుత్వం సొం తానికి వాడుకున్నదని ఆరోపించారు.






