11-06-2025 12:42:46 AM
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహకు వినతిపత్రంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్
రామగుండం జూన్ 10(విజయ క్రాంతి): రామగుండంలో రామగుండం లోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ (సీమ్స్) అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా సీమ్స్ వద్ద ఉన్న రాజీవ్ రహదారి పై పాదచారుల రక్షణార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వారి సహచరుల (అటెండెంట్స్) కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్, రెస్ట్ రూమ్స్, మార్చురీ నిర్మాణానికి సంబంధించిన సదుపాయాల ఏర్పాటు చేయాలని కోరారు.
రామగుండం ప్రాంతానికి మెడికల్ సేవల విస్తరణ, రోగుల సౌలభ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే మంత్రి కి వివరించారు. స్పందించిన మంత్రి రాజనర్సింహ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.