11 April, 2026 | 3:15 PM

Breaking News

కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •  

అడెల్లి నూతన ఆలయంలో కొలువైన పోచమ్మ

08-11-2025 12:00 AM

స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు

నిర్మల్, నవంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయా ల్లో ఒకటైన అడెల్లి పోచమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రూ.6.6 కోట్లతో నూతన ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేపట్టగా ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, జి విట్టల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు తదితర ప్రముఖులు హాజరై.. ఉదయం 9:30 నిమిషాలకు నూతన ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు.

నాలుగు రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమర్పిం చారు. భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొజాగౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు