15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

బెల్లంపల్లిలో పోలీసుల రక్తదాన శిబిరం

29-10-2025 04:41 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధ వారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపి ఏ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారోత్సవాల సందర్భంగా పలువురు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సమాజ హితం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తోపాటు పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, తాండూర్, మందమర్రి సిఐలు దేవయ్య, శశిధర్ రెడ్డిలతోపాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.