16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రౌడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలి

08-11-2025 08:59 PM

మీపై ఇక పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా

మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ తీవ్ర పరిణామాలు

ముత్తారంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ లో మంథని సిఐ రాజు గౌడ్ 

ముత్తారం (విజయక్రాంతి): రౌడీ షీటర్లు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డ తీవ్ర పరిణామాలు ఉంటాయని మంథని సీఐ రాజు గౌడ్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ లో హెచ్చరించారు. ముత్తారం పోలీస్ స్టేషన్ లో శనివారం మంథని సీఐ రాజు గౌడ్, ముత్తారం ఎస్ఐ రవికుమార్ తో కలిసి మండలంలోని రౌడీ షీటర్లకు పాత నేరస్తులను పిలిపించి మాట్లాడారు.

మీపై ఇక పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉందాని, మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించారు. చాలామంది రౌడీ షీటర్ లలో ఇప్పటికే ఎంతో మార్పు వచ్చిందని, తెలుసో తెలియక చేసిన తప్పులను అర్థం చేసుకొని వారి కుటుంబ సభ్యులతో కష్టపడుతూ పనిచేస్తూ జీవిస్తున్నారని, కొంతమందిలో ఇంక మార్పు రావడం లేదని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారు ఎలాంటి సంఘటనలకు పాల్పడ్డ చట్టపరంగా శిక్షిస్తామన్నారు.