02-12-2025 05:36:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో చైనా మాంజా దారం విక్రయిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రజలకు హాని కలిగించే ఏ చర్యలకు ఉపక్రమించిన చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పోలీసులు తెలిపారు.