12 June, 2026 | 2:22 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

27-10-2025 08:20 PM

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీ

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ కమాన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు విభాగం యొక్క త్యాగస్ఫూర్తి, సేవా భావం, సామాజిక బాధ్యతలను ప్రజలకు తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి డివిజన్ ఏసిపి ఎస్.చక్రపాణి మాట్లాడుతూ “పోలీసులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. పోలీసు అమర వీరుల త్యాగం స్మరణీయమైనది. ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ఆ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలలో, యువతలో సేవా స్పూర్తిని పెంపొందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్, గోవింద రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు  పోలీస్ సిబ్బంది, దాదాపు 200 మంది వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.