02-06-2025 02:13:08 AM
వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్
హనుమకొండ, జూన్ 1 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం మేమున్నామంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో వివిధ పోలీసు బలగాల ఆధ్వర్యంలో వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి వరంగల్ కోట వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఏసీపీ నందిరాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్ని జెండా ఊపి కవాతు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు తుమ్మ గోపిరెడ్డి, షుకూర్, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.