7 August, 2026 | 9:37 AM

పోలీసుల సరెండర్ లీవ్ బడ్జెట్ విడుదల

30-10-2024 12:34 AM

182.48 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థా యిలో విడుదల చేసింది. రూ. 182.48 కోట్ల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో కాలంగా పోలీస్ సిబ్బంది ఎదురుచూస్తున్న సరెండర్ లీవ్‌లకు సం బంధించిన బడ్జెట్‌ను విడుదల చే యడంపై పోలీస్ అధికారుల సం ఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.