15 June, 2026 | 10:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్

18-11-2025 12:00 AM

గ్రీవెన్స్‌లో పలు ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడిన ఎస్పీ

నల్గొండ క్రైం, నవంబర్ 17: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 28 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.. ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదని, ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.