25-06-2025 05:38:40 PM
మున్సిపల్ కమిషనర్ రాయలింగు..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పొదుపు సంఘాల మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఉన్నత శిధికి చేరుకోవాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు(Municipal Commissioner Thungapindi Rajalingu) కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో బుధవారం పొదుపు సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించి తమ ఉత్పత్తులను పెంచుకోవాలని కోరారు. పొదుపు సంఘాల మహిళలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు వారి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తద్వారా వారు అభివృద్ధి బాట పడతారని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.
100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్పీలు చేపట్టడం గొప్ప విషయం అని వారిని అనినందించారు. ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన బ్యాగులు, ఇతర వస్తువులు, తిను బండారాలను పట్టణ ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి ఏనుగు రఘురాం, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.