01-10-2025 08:03:10 PM
తహాశీల్దార్ శ్రీకాంత్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓలదే కీలక పాత్రని, ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీలు అన్నారు. బుధవారం మండలంలోని రామన్నగూడెం గ్రామ రైతువేదికలో పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, ఇట్టి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ, శిక్షకులు వి.సైదులు, పి.మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, రాజశేఖర్, నారాయణ మూర్తి, రమేష్, పీఓలు, ఏపీవోలు పాల్గొన్నారు.