3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

అంధకారంలో వేల్పుచర్ల 8వ వార్డు

24-05-2025 11:46 AM

పట్టించుకోని అధికారులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని వేల్పుచర్ల గ్రామ 8వ వార్డులో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగక అంధకారంలో ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.వర్షాకాలం సమీపిస్తుండడంతో రాత్రి వేళలో వీధి దీపాలు వెలగక ఎక్కడ నుంచి పాములు,తేల్లు,పురుగులు వచ్చి కాటేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తుడు ఖమ్మంపాటి జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వీధిలైట్లు వేయించాలని కోరారు.