22 April, 2026 | 12:07 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

బస్తీబాటతో అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా

23-10-2025 11:37 AM

తుంగతుర్తి ఏఈ సురేందర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పలు వార్డుల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించి మాట్లాడారు. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు బస్తీబాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్లు రాజ్ కుమార్, జిలాని, హెల్పర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.